అత్యాచార బాధిత కుటుంబానికి రూ.10లక్షలు ఆర్థిక సాయం

Vijayawada: విజయవాడ అత్యాచార ఘటనలో బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.

Update: 2022-04-22 16:15 GMT

అత్యాచార బాధిత కుటుంబానికి రూ.10లక్షలు ఆర్థిక సాయం

Vijayawada: విజయవాడ అత్యాచార ఘటనలో బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించింది. ఇప్పటికే సీఎం ఆదేశాలతో విధుల్లో నిర్లక్ష్యం వహించిన సీఐ, ఎస్సైలను సస్పెండ్‌ చేశారు అధికారులు. అలాగే.. విజయవాడ ఆస్పత్రి సిబ్బందిపైనా చర్యలకు ఉపక్రమించారు. నిందితులు ఫాగింగ్‌ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించి.. వారిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ ఆస్పత్రిలో సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫాగింగ్ ఏజెన్సీకి టెర్మినేషన్‌ నోటీసు‎లు ఇచ్చారు.

Tags:    

Similar News