వీర జవాన్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50లక్షల సాయం

జమ్మూకశ్మీర్‌లో వీర మరణం పొందిన జవాను ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రూ. 50లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు. జవాన్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్నారు సీఎం జగన్

Update: 2020-11-09 14:16 GMT

జమ్మూకశ్మీర్‌లో వీర మరణం పొందిన జవాను ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రూ. 50లక్షల రూపాయల ఆర్ధిక సాయం ప్రకటించారు. జవాన్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ప్రాణ త్యాగం వెలకట్టలేనిదన్న సీఎం జగన్.. దేశం కోసం ప్రవీణ్ వీర మరణం పొందారని అన్నారు. ప్రవీణ్‌రెడ్డి మరణం దేశానికే కాదు అతని కుటుంబానికి తీరని లోటని అన్నారు.. అందుకే, ప్రవీణ్ కుటుంబానికి తమ ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి కొంతైనా ఆసరాగా ఉండేలా 50లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోందని, ఈ సాయాన్ని స్వీకరించాలని ప్రవీణ్‌ భార్య రజితకు సీఎం జగన్ లేఖ రాశారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి గత 18 ఏళ్లుగా భారత సైన్యంలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో పని చేస్తున్నారు.అయితే తాజాగా జమ్మూ కశ్మీర్‌లోని మాచిల్‌ సెక్టార్ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులలో వీరమరణం పొందాడు.

Tags:    

Similar News