ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో అధికారం చేపట్టినప్పటి నుంచి సీఎం జగన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సంక్షేమ పథకాలను అందుబాటులోకి తెస్తూనే, మరోవైపు పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి బుధవారం మంత్రులు కచ్చితంగా సచివాలయంలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల కోసం ఈ మేరకు అందుబాటులో ఉండాలని పేర్కొంది. సందర్శకుల ముందస్తు ఏర్పాట్లు, సౌకర్యార్థం ఉత్వర్వులు జారీ చేసినట్లు తెలిపింది.