Andhra Pradesh: ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌కు సీఎం జగన్‌ లేఖ

Andhra Pradesh: ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌కు లేఖ రాశారు సీఎం జగన్‌.

Update: 2021-04-17 13:58 GMT

Andhra Pradesh: ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌కు సీఎం జగన్‌ లేఖ

Andhra Pradesh: ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌కు లేఖ రాశారు సీఎం జగన్‌. శ్రీకాకుళం జిల్లాలోని నేరడి బ్యారేజ్‌పై సమావేశమవుదామని ఆయన తెలిపారు. ఇరువురం చర్చించి, సమస్యను పరిష్కరించుకుందామంటూ లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్‌. దీనికి సంబంధించి చర్చించేందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ సహాయం కోరారు. నేరడి బ్యారేజ్ నిర్మాణంతో ఒడిశా రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. దీనివల్ల ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రైతులకు, ఒడిశాలోని గణపతి జిల్లా రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని లేఖలో తెలిపారు. సముద్రంలోకి వృథాగా పోయే 80 టీఎమ్‌సీల నీటిని నేరడి బ్యారేజ్ నిర్మాణం ద్వారా వినియోగంలోకి తీసుకురావచ్చన్నారు.

Tags:    

Similar News