ఇది శుభసూచకం.. సీఎం జగన్ ట్వీట్
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి నిల్వ సామార్థ్యాన్ని చేరుకోనుండడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతోషం వ్యక్తంచేశారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి నిల్వ సామార్థ్యాన్ని చేరుకోనుండడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతోషం వ్యక్తంచేశారు. దిగువ ప్రాంతాల ఆయకట్టును తడిపేందుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అన్నదాతల ముఖాల్లో ఆనందాలు నింపేలా ప్రకృతి సహకరించడం శుభసూచకం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యాన్ని చేరుకుంటున్నాయి. దిగువ ప్రాంతాల ఆయకట్టును తడిపేందుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అన్నదాతల ముఖాల్లో ఆనందాలు నింపేలా ప్రకృతి సహకరించడం రైతన్నలకు శుభసూచకం.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 12, 2019