వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు.. ప్రారంభించిన సీఎం జగన్‌

YSR Pension Kanuka: ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామన్నారు ఏపీ సీఎం జగన్.

Update: 2022-01-01 07:32 GMT

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు.. ప్రారంభించిన సీఎం జగన్‌

YSR Pension Kanuka: ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నామన్నారు ఏపీ సీఎం జగన్. మేనిఫెస్టోలో మరో హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు. అధికారంలోకి రాగానే పింఛన్ 2వేల 250కు పెంచామన్నారు. రెండున్నరేళ్లలో ఇవాళ 2వేల 500 కు పింఛన్ పెంచుతున్నామని చెప్పారు. వైఎస్సార్ పింఛను కానుక పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, తదితరులకు 250 రూపాయల పింఛను పెంపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రారంభించిన జగన్ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని గర్వంగా చెబుతున్నానని అన్నారు. మంచి చేస్తుంటే విమర్శించే వాళ్లు కూడా ఉంటారని అన్నారు.

Tags:    

Similar News