AP CM Jagan: ఒమిక్రాన్ ప్రచారంతో ఆర్థికస్థితి కాస్త మందగించింది

Jagan: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన 217వ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగింది.

Update: 2021-12-07 16:00 GMT

AP CM Jagan: ఒమిక్రాన్ ప్రచారంతో ఆర్థికస్థితి కాస్త మందగించింది

Jagan: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన 217వ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగింది. కోవిడ్‌ తదనంతర పరిస్థితుల్లో జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశాల్లో ఇది ప్రత్యేకమైందన్నారు సీఎం జగన్. థర్డ్‌వేవ్, ఒమిక్రాన్‌పై ప్రచారం కారణంగా ఆర్థిక స్థితి కాస్త మందగించిందన్న జగన్ లేదంటే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా వేగంగా పుంజుకునేదని అభిప్రాయపడ్డారు. సంక్షేమం, అభివృద్ధి సహా అన్ని రంగాల్లో పురోగమించేలా చర్యలు చేపడుతున్నట్లు సీఎం వివరించారు. ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు అందేలా చూడాలన్నారు. బ్యాంకుల సహకారంతో రాష్ట్ర ఆర్ధికస్థితి గట్టెక్కిందని సీఎం జగన్ పేర్కొన్నారు.

Tags:    

Similar News