Andhra Pradesh: ఏపీ అమర జవాన్ల కుటుంబాలకు రూ.30లక్షలు

Andhra Pradesh: ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో అమరులైన ఇద్దరు ఏపీకి చెందిన జవాన్ల మృతిపట్ల సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Update: 2021-04-05 11:14 GMT

Andhra Pradesh: ఏపీ అమర జవాన్ల కుటుంబాలకు రూ.30లక్షలు

Andhra Pradesh: ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో అమరులైన ఇద్దరు ఏపీకి చెందిన జవాన్ల మృతిపట్ల సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈ ఘటనలో అమరులైన ఏపీకి చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢసంతాపాన్ని తెలియజేశారు. ఈ రెండు కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు.

విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ కుటుంబాలకు చెరో రూ.30 లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సహాయాన్ని వెనువెంటనే అందించి బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని ముఖ్యమంత్రి తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News