Jagan Tour: సీఎం జగన్‌ రెండు రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారు

* ఇవాళ సాయంత్రం గన్నవరం నుంచి రేణిగుంటకు సీఎం జగన్ * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు స్వాగతం పలకనున్న సీఎం

Update: 2021-11-13 02:33 GMT

సీఎం జగన్‌ రెండు రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్ ఖరారు(ఫైల్ ఫోటో)

Jagan Tour: సీఎం జగన్‌ రెండు రోజుల తిరుపతి పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఇవాళ సాయంత్రం గన్నవరం నుంచి రేణిగుంటకు సీఎం జగన్‌ బయల్దేరనున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టులో ఇవాళ రాత్రి 7 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు సీఎం స్వాగతం పలకనున్నారు.

అనంతరం రేణిగుంట నుంచి తిరుమల బయలుదేరుతారు. రాత్రి 9.30 గంటలకు తిరుమల శ్రీవారిని సీఎం జగన్‌ దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం రేణిగుంట నుంచి తాడేపల్లికి సీఎం జగన్‌ బయల్దేరుతారు.

తిరుపతిలో ఈ నెల 14న మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం జగన్‌ పాల్గొంటారు. అందుకుగాను 14న మధ్యాహ్నం 1.15 గంటలకు సీఎం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరుపతికి చేరుకుంటారు.

Full View


Tags:    

Similar News