AP Cabinet Expansion : రేపు ఏపీ మంత్రివర్గ విస్తరణ..

Update: 2020-07-21 05:41 GMT

AP Cabinet Expansion : రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఖరారు అయింది. రేపు(బుధవారం) మధ్యాహ్నం 1:29 నిముషాలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. రాజీనామా చేసిన మంత్రుల సామాజిక వర్గానికే తిరిగి మంత్రి వర్గం లో అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్య కార కుంటుంబానికి చెందిన పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.

మంత్రి వర్గ సభ్యుల పేర్లను నేడు అధికారికంగా వెల్లడించనున్న ప్రభుత్వం. కొత్త మంత్రులతో గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించనున్నారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం జగన్‌ రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారు. రాజ్యసభకు ఎన్నికైనందున సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ తమ మంత్రి పదవులకు చేసిన రాజీనామాలను నిన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే. వారు రాజీనామాలు చేసిన స్థానాల్లో కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు.

Tags:    

Similar News