ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం

Update: 2019-06-12 16:01 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు ప్రొటెం స్పీకర్. ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవికి ఆయన నామినేషన్ ఒక్కటే దాఖలైంది. దీంతో సీతారాం ఎన్నిక లాంఛనమైంది. గురువారం ఉదయం 11గంటలకు ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా తమ్మినేని సీతారాం బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. కాగా వైసీపీ సభ్యుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మినహా 173మంది సభ్యులు ప్రమాణస్వీకారం పూర్తయింది.ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం 

Tags:    

Similar News