ప్రజావేదిక కూల్చివేతలో మరో ట్వీస్ట్ చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో నుంచి ప్రజా వేదికకు వెళ్లే మార్గంలో రోడ్డు వేసిన భూమిని తనకు ఇచ్చేయాంటూ పొలం యజమాని డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం తనతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సీఆర్డీఏ అధికారులకు అందజేశారు. ప్రజా వేదికను అక్రమంగా గుర్తించి కూల్చివేసినందున తన పొలం ఇవ్వాలంటూ అధికారులను కోరారు. ఇదే సమయంలో ప్రజా వేదిక పక్కనున్న 10 అడుగుల రోడ్డును కూడా తవ్వేయాలని అధికారులు నిర్ణయించారు.