టీడీపీ నేత అంకులు కుటుంబంలో మరో విషాదం

Update: 2021-01-04 12:17 GMT

టీడీపీ నేత పురంశెట్టి అంకులు కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. అంకులు హత్య నేపథ్యంలో మనోవేదనకు గురయ్యారు కుటుంబసభ‌్యులు. ఈ క్రమంలో మానసిక వ్యాధితో అంకులు బావమరిది శ్రీనివాస్‌ స్పృహ కోల్పోయారు. ఇక స్పృహ కోల్పోయిన కొద్దిసేపటికే ఆయన మృతి చెందారు. దీంతో దాచేపల్లి మండలం పెదగార్లపాడులో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచి, టీడీపీ పార్టీ సీనియర్ నేత పురంశెట్టి అంకులును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కత్తులతో పొడిచి, మెడకోసి మరీ విచక్షణరహితంగా హత్య చేశారు.

Tags:    

Similar News