మానవత్వం చాటుకున్న మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత

ఏపీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనితలు మానవత్వాన్ని చాటుకున్నారు. కరకట్టపై ప్రమాదానికి గురైన వ్యక్తిని సరైనా సమయంలో ఆస్పత్రికి తరలించారు.

Update: 2020-11-05 12:48 GMT

ఏపీ మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనితలు మానవత్వాన్ని చాటుకున్నారు. కరకట్టపై ప్రమాదానికి గురైన వ్యక్తిని సరైనా సమయంలో ఆస్పత్రికి తరలించారు. దొండపాడుకు చెందిన నరసింహారావు కరకట్టపై ప్రయాణిస్తున్న సమయంలో ఆటో ఢీ కొట్టింది. దాంతో అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న మంత్రులు తానేటి వనిత, మేకతోటి సుచరిత గాయపడిన వ్యక్తిని చూశారు.. వెంటనే కారు ఆపి.. నరసింహరావుకు సాయం చేశారు. వెంటనే కారులో హాస్పిటల్‌కి తరలించి వైద్యం అందించారు..

Tags:    

Similar News