MP Kesineni Meets Nitin Ghadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని..

MP Kesineni Meets Nitin Ghadkari: టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేసినేని నాని నేడు డిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరినీ కలిసి లేఖను అందజేసారు.

Update: 2020-08-15 11:41 GMT
Kesineni Meets Nitin Ghadkari (twitter photos)

MP Kesineni Meets Nitin Ghadkari: టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేసినేని నాని నేడు డిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరినీ కలిసి లేఖను అందజేసారు. దీనిపై నాని ట్వీట్ చేశారు. 'ఈ రోజు ఢిల్లీ లో నితిన్ గడ్కరీ గారిని కలసి విజయవాడ పౌరుల చిరకాల స్వప్నం అయిన కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తి అయిన సందర్బంగా కృతజ్ఞతలు తెలియచేసి, విజయవాడ వచ్చి ఫ్లైఓవర్ ను ఆయన అమృత హస్తాలతో ప్రారంభించ వలసింది గా కోరాను.' అంటూ త్వీట్ చేసారు. అంతే కాదు, మీరు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు మీరు ప్రారంభిస్తేనే బాగుంటుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నగరానికి కనకదుర్గ ఫ్లైఓవర్ అందమైన మణిహారం వంటిదని అయన అభివర్ణించారు.  


 

Tags:    

Similar News