ఏపీలో 180కి చేరిన కరోనా కేసులు.. జిల్లాల వారీగా ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు..
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అదనంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలను ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. కృష్ణాలో 4, కడపలో 4, గుంటూరులో 3, కర్నూల్లో 3, చిత్తూరు, ప్రకాశంలలో ఒక్కో కేసు నిన్న రాత్రి నుంచి అదనంగా నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఎక్కువ మంది దిల్లీలోని జమాత్ వెళ్లినవారేనని అధికారులు గుర్తించారు.