గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకోం : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పై సంచలన వాఖ్యలు చేశారు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి.
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పై సంచలన వాఖ్యలు చేశారు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి. గత కొద్ది రోజులుగా గంట వైసీపీలో చేరుతున్నారు అనే వార్తలు వస్తున్న నేపధ్యంలో దీనిపైన స్పందించిన విజయసాయిరెడ్డి అవన్నీ ఆవాస్తవాలేనని, అందులోనిజం లేదని అన్నారు. ఒకవేళ గంటా శ్రీనివాసరావుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పరిస్ధితి లేదని అయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచినా తర్వాత ప్రజలను మరిచిపోవడం గంటాకి అలవాటేనని అన్నారు.
ఒకసారి గెలిచిన చోట మరల ఎన్నికల్లో పోటీ చేయరని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్సార్ సీపీ ఉత్తరనియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో ఆదివారంజరిగిన నిత్యావసర వస్తువుల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న అయన ఈ వాఖ్యలు చేశారు. గెలిపించిన గంటా మీకు అందుబాటులో లేకుండా ఉన్నారని, ప్రస్తుతం గంటా ఎక్కడున్నారో తెలియదని వాఖ్యానించారు. అదే ఓడిపోయిన కేకే రాజు మాత్రం నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారని అన్నారు.
అదేవిధంగా చంద్రబాబు, లోకేష్ లపై కూడా నిప్పులు చెరిగారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు సైకిల్ పై కూర్చుంటే సైకిల్ కదలదు. చిన్నబాబు సైకిల్ పై కూర్చుంటే సైకిల్ బతకదని చంద్రముఖిగా మారిన చంద్రబాబును వేధిస్తున్న ప్రధానమైన సమస్య అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారం పొగొట్టుకున్నాడు. చిన్నబాబును ఓడగొట్టుకున్నాడు. పార్టీ ప్రెసిడెంట్ పదవిలో కరోనా గబ్బిలంలాగా అంటిపెట్టుకున్నడని, త్వరలో మండలి రద్దు కాబోతోంది అయన కొడుకు పరిస్ధితి ఏంటి ఇవి చంద్రబాబును వేదిస్తున్న ప్రశ్నలని ఆయన అన్నారు.