దారుణం: కూతురు, అల్లుడు చేతిలో హత్యకు గురైన తల్లిదండ్రులు

Update: 2020-12-16 08:13 GMT

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ ఇద్దరు దంపతులు హత్యకు గురయ్యారు. అయితే కన్న కూతురే భర్తతో కలిసి తల్లిదండ్రులను చంపారని తెలుస్తోంది. గ్రామానికి చెందిన ముత్తయ్య, సుగుణమ్మ దంపతులకు కూతురు మనీషా ఉంది. మనీషా కోట బాబురావుతో నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు మనీషాకు కలహాలు ఏర్పడ్డాయి. ఈ కోపంతో మనీషా తన భర్తతో కలిసి తల్లిదండ్రులను అతి దారుణంగా చంపేసి, పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News