Andhra Pradesh Live Updates: ఆంధ్రప్రదేశ్ జిల్లాల తాజా వార్తలు

Andhra Pradesh Live Updates: ఆంధ్రప్రదేశ్ జిల్లాల తాజా వార్తలు

Update: 2021-02-21 01:04 GMT
ఆంధ్రప్రదేశ్ (ఫోటో ది హన్స్ ఇండియా)

చిత్తూరు జిల్లా:

చిత్తూరు జిల్లా రామకుప్పంలో కిడ్నాప్‌ కలకలం రేగింది. ఓ మహిళా టీచర్‌ను కిడ్నాప్‌ చేసి సుమోలో తీసుకెళ్తుండగా పోలీసులు చేజ్‌ చేసి పట్టుకున్నారు. కిడ్నాప్‌కు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కిడ్నాపర్లు వాడిన సుమోను స్వాధీనం చేసుకున్నారు.

ప్రకాశం జిల్లా: 

ప్రకాశం జిల్లా నుండి కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. 3 లారీల్లో తరలిస్తున్న 90 టన్నుల రేషన్‌ బియాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

 నెల్లూరు జిల్లాలో:

 నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ఓ స్కూటర్ లో పాము కన్పించడం కలకలం రేపింది. స్కూటర్ సీటు కవర్‌ తీయడంతో ఒక్కసారిగా పాము ప్రత్యక్షమయ్యింది. దీంతో మెకానికి భయాందోళనకు గురయ్యాడు. ఎట్టకేలకు బండిలో దాక్కున్న పామును బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 కర్నూలు జిల్లా:

బనగానపల్లె నియోజకవర్గం వ్యాప్తంగా అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది. కోత నూర్పిడి దశలో ఉన్న తరుణంలో వర్షం అన్నదాతను ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికే కోత కోసిన పంట కూడా కళ్లల్లో ఉండటంతో వర్షానికి తడిసిముద్దయ్యింది.

నెల్లూరు జిల్లాలో:

నెల్లూరు జిల్లాలో అకాల వర్షాలతో అన్నదాతకు మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. కోత దశలో ఉన్న వరి పైర్లు నీట మునిగాయి. నూర్పిడి చేసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. గూడూరు, నాయుడుపేట రెవెన్యూ డివిజన్లలో

Live Updates
2021-02-21 14:09 GMT

Andhra Pradesh న్యూస్

ఆంధ్రప్రదేశ్:

*ఏపీలో కొనసాగుతున్న తుదిదశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌

*రాష్ట్రవ్యాప్తంగా 82.85 శాతం పోలింగ్‌ నమోదు

*చివరివిడతలోనూ కొనసాగుతున్న వైసీపీ మద్దతుదారుల హవా

Tags:    

Similar News