ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

* విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు ఏపీ బీజేపీ వ్యతిరేకం -సోము వీర్రాజు * ఈ నెల 14న బీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్తాం -సోము వీర్రాజు

Update: 2021-02-05 09:47 GMT

Somu Veer Raju (file Image)

ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు ఏపీ బీజేపీ వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ మాధవ్‌, పలువురు కేంద్రమంత్రులను కలిశారన్నారు. అయినప్పటికీ.. ఈ నెల 14న బీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్తున్నట్టు సోము వీర్రాజు చెప్పారు. జేపీ నడ్డా, ప్రధాని మోడీని కలిసి పరిస్థితులు వివరిస్తామన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పునరాలోచించుకోవాలని కోరతామని సోము వీర్రాజు అన్నారు. 

Tags:    

Similar News