ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజు కొనసాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన నేతలు వైఎస్ వివేకానందరెడ్డి, సుబ్బారెడ్డి, సంజీవరెడ్డి మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా రెండు నిమిషాల పాటు ఏపీ అసెంబ్లీ మౌనం పాటించింది. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే సభాపతి తమ్మినేని సీతారాం సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలపై చర్చ సాగుతోంది. శాసనసభలో ఉదయం 11 గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నికను నిర్వహిస్తారు.