Adimulapu Suresh: మార్చిలో పదో తరగతి పరీక్షలు

AP SSC Exams 2022: ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చిలో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు.

Update: 2022-01-07 14:29 GMT

Adimulapu Suresh: మార్చిలో పదో తరగతి పరీక్షలు

AP SSC Exams 2022: ఏపీలో పదో తరగతి పరీక్షలు మార్చిలో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. గుంటూరు జిల్లా వినుకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 7 సబ్జెక్టులతో పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. సంక్రాంతి నాటికి సిలబస్ పూర్తి చేయాలని విద్యాసంస్థలకు సూచించారు. సీబీఎస్‌ఈ సిలబస్‌ వీలైనంత త్వరగా ప్రారంభిస్తామన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సీబీఎస్‌ఈలో పదో తరగతి మొదటి బ్యాచ్‌ పరీక్ష నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

Tags:    

Similar News