Amaravati: నేను చదువుకోలేదు, వాళ్లు పెట్టమన్నచోట సంతకం పెట్టా

Amaravati: ఏపీ రాజధాని అసైన్డ్ భూములపై సీఐడీ విచారణ చేపట్టింది.

Update: 2021-07-07 10:41 GMT

పోలా రవి

Amaravati: ఏపీ రాజధాని అసైన్డ్ భూములపై సీఐడీ విచారణ చేపట్టింది. అసైన్డ్ భూమి అమ్ముకున్న రైతులు విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తనపై కక్షపూరితంగా వ్యవహరించారని విచారణకు హాజరైన రైతు పోలారవి ఆరోపించారు. దళితుడిగా తన భూమిని అమ్ముకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. అమ్ముకున్న పొలం విషయమై తనను సీఐడీ ప్రశ్నించిందని తాను ఐదుగురికి సాక్షి సంతకాలు పెట్టానంటే సీఐడీ వాళ్లు 51 మందికి సాక్షి సంతకం పెట్టానంటున్నారని చెప్పారు. తాను చదువుకోలేదని వాళ్లు పెట్టమన్నచోట సంతకం పెట్టానని రవి చెప్పారు.

Tags:    

Similar News