జనసేనకు షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన మరో కీలక నేత..

Update: 2019-10-05 07:01 GMT

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీ మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత ఆకుల సత్యనారాయణ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తన రాజీనామా పత్రాన్నిజనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పంపించారు. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు జనసేన పార్టీలో చేరిన ఆయన రాజమండ్రి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.


 



 

Tags:    

Similar News