Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Chandrababu: సీఐడీ తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్గీ

Update: 2023-10-10 09:03 GMT

Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా

Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఇరు వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు తదుపరి వాదనలు వింటామని స్పష్టం చేసింది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపించగా.. ఏపీ సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అయితే శుక్రవారం జరిగే విచారణకు తాను అందుబాటులో ఉండడంలేదని సుప్రీంకోర్టుకు తెలిపారు సీఐడీ తరపు లాయర్ ముకుల్ రోహత్గీ. మరో వైపు చంద్రబాబు తరపు లాయర్ హరీష్ సాల్వే వచ్చే సోమవారం తన వాదనలు వినిపిస్తామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News