Guntur: యువతిపై సామూహిక అత్యాచారం

Guntur: గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.

Update: 2021-06-20 08:53 GMT

(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )

Guntur: గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సీతానగరం పుష్కరఘాట్ల దగ్గర నదీతీరంలో ఓ యువతిపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారానికి ఒడిగట్టినట్లు బాధితురాలు ఆరోపిస్తుంది. నిందితులు పడవలో విజయవాడ వైపు వెళ్లిపోయారని భావిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. నదీతీరంలో ప్రేమజంట సేదతీరటానికి వచ్చినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశారు. న‌లుగురు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Tags:    

Similar News