Vijayawada: ప్రేయసిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు

Update: 2021-08-20 08:03 GMT

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ (ఫైల్ ఫోటో)

Vijayawada: విజ‌య‌న‌గ‌రం జిల్లా పూస‌పాటిరేగ మండ‌లం చౌడువాడ‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. దీంతో ఆ యువ‌కుడిని అడ్డుకోబోయిన యువ‌తి అక్క, ఆమె కుమారుడికి కూడా గాయాలయ్యాయి. వెంట‌నే స్థానికులు, బాధితులు ముగ్గురిని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News