Coronavirus Updates in AP: ఏపీలో మరో 611 కరోనా పాజిటివ్‌ కేసులు

Update: 2020-07-01 08:11 GMT

611 new coronavirus cases in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 611 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 28239 శాంపిల్స్‌ని పరీక్షించగా 611 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 342 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో 6 మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు మృతి చెందారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 12,813. ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 193. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5587కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 7,033 మంది చికిత్స పొందుతున్నారు.



 



Tags:    

Similar News