ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ముగ్గురు యువకులను తీవ్రంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ అమ్మాయి వెంట పడుతున్నారనే కారణంతో యువతి కుటుంబ సభ్యులు సుభానీ, చిన్నూతో పాటు మరోవ్యక్తి.. వారిపై విరుచుకుపడ్డారు. మాట్లాడదాం అని చెప్పి శివా, రియాజ్, బ్రహ్మంను ఊరి శివారులో ఉన్న పామాయిల్ తోటకు తీసుకెళ్లి చితక్కొట్టారు. కట్టెలతో ఇష్టానుసారం కొడుతూ కాళ్లతో ముఖాలపై తన్నారు. కాళ్లా వేళ్లా పడ్డా బూతులు తిడుతూ రెచ్చిపోయారు. అంతేకాకుండా ఈ దృశ్యాలను సెల్ఫోన్లో రికార్డ్ చేశారు. దీంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న సింగరాయకొండ పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.