Chittoor: స్వర్ణముఖి నదిలో ముగ్గురు గల్లంతు.. గల్లంతైనవారిలో ఓ మహిళ..

Chittoor: *చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు *ఉధృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి

Update: 2021-11-12 08:26 GMT

Chittoor: స్వర్ణముఖి నదిలో ముగ్గురు గల్లంతు.. గల్లంతైనవారిలో ఓ మహిళ..

Chittoor: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏర్పేడు మండలం గోవిందవరంలో స్వర్ణముఖి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఇక.. అదే సమయంలో నది దాటేందుకు యత్నించిన ముగ్గురు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు.

వీరిలో ఓ మహిళ కూడా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సాయంతో గల్లంతైనవారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News