Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2,527 కరోనా కేసులు నమోదు

Corona Cases in AP: ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతుంది.

Update: 2021-07-21 15:47 GMT

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 2,527 కరోనా కేసులు నమోదు

Corona Cases in AP: ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. తాజాగా రెండు వేల 527 కరోనా కేసులు నిర్దారణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 19 మంది కరోనాతో మరణించారు. చిత్తూరు 4, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కడప, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలుకోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ర్టంలో 19 లక్షల 46 వేల 749 మంది వైరస్ భారీన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ర్ట వ్యాప్తంగా మృతుల సంఖ్య 13 వేల 197కు చేరింది. ప్రస్తుతం రాష్ర్టంలో 23 వేల 939 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Tags:    

Similar News