ఏపీలో మరో 16 కరోనా కేసులు నమోదు

ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి.

Update: 2020-04-10 16:43 GMT

ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఏడూ గంటల వరకు ఏపీలో 16 కేసులు నమోదు అయ్యాయి.ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఉదయం తొమ్మిది నుంచి రాత్రి ఏడూ గంటల వరకు ఏపీలో 16 కేసులు నమోదు అయ్యాయి.

 గుంటూరు జిల్లాలో తాజాగా ఏడూ, తూర్పు గోదావరి జిల్లాలో ఐదు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో రెండు చొప్పున కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 381 చేరింది.

కర్నూలు జిల్లాలో అత్యధికంగా 77 మంది కరోనా బాధితులు ఉండగా.. గుంటూరులో తాజాగా ఏడుగురికి పాజిటివ్ రావడంతో ఆ జిల్లాలో కోవిడ్ పేషెంట్ల సంఖ్య 58కి చేరింది. నెల్లూరు జిల్లాలో 48 మందికి కరోనా సోకగా.. ఒకరు డిశ్చార్జ్ అయ్యారు. ప్రకాశం జిల్లాలో 40 మందికి కరోనా పాజిటివ్ రాగా.. ఒకరు కోలుకున్నారు.

Tags:    

Similar News