ఏపీలో మరో 14 కరోనా పాజిటివ్ కేసులు..

Update: 2020-04-06 05:57 GMT
Representational Image

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. రాష్ట్రంలో ఆదివారం రాత్రి 10 గంటల నుంచి.. సోమవారం ఉదయం 10 గంటల వరకు కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 266కి పెరిగింది. రాష్ట్రంలో కొత్తగా అనంతపూరంలో ఒక మరణం, కృష్ణా జిల్లాలో ఒక మరణం సంభవించాయి. 

తాజాగా విశాఖ జిల్లాలో 5, అనంతపురం జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 2, పశ్చిమగోదావరి జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. ఈ కేసుల్లో కూడా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు ఎక్కువమంది ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకూ కొవిడ్‌ నుంచి కోలుకొని ఐదుగురు డిశ్చార్జ్‌ అయ్యారని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News