ఏపీలో కొత్తగా 1,160 కరోనా కేసులు!

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 60,307 కరోనా టెస్టులు చేయగా 1,160 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Update: 2020-11-21 12:26 GMT

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో 60,307 కరోనా టెస్టులు చేయగా 1,160 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,61,092 కి చేరుకుంది. అయితే ఇందులో 14,770 యాక్టివ్ కేసులుండగా 8,61,092 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,765 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 07 మంది చనిపోయారు. దీనితో మృతుల సంఖ్య 6,927 కి చేరుకుంది.

చిత్తూరులో ఇద్దరు, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అటు జిల్లాల పరంగా కేసులు చూసుకుంటే.. అనంతపుర్ లో 43, చిత్తూరులో 148, ఈస్ట్ గోదావరిలో 165, గుంటూరులో 121, కడపలో 70, కృష్ణాలో 189, కర్నూల్ లో 23, నెల్లూరులో 60, ప్రకాశంలో 66, శ్రీకాకుళం 46, విశాఖపట్నం 67, విజయనగరం 42, వెస్ట్ గోదావరి 120 కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఇప్పటివరకు ఏపీలో 95,43,177 కరోనా టెస్టులు నిర్వహించారు.


Tags:    

Similar News