ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ఇవాళ అన్ని శాఖల అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శాఖల అధికారులతో భేటీ కానున్నారు. 12 న ఉదయం 11 గంటలకు బడ్జెట్, ఆ తర్వాత వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఈ నేపథ్యంలో శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలతో పాటు సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేస్తారు.