కృష్ణాజిల్లాలో వృద్ధదంపతుల వినూత్న నిరసన
-కృష్ణాజిల్లాలో వృద్ధదంపతుల వినూత్న నిరసన -వాటర్ ట్యాంక్ ఎక్కిన చిలకపాటి వాసుదేవరావు,లక్ష్మీ -ముసునూరు మండలం కాట్రేనిపాడు శివారు హరిశ్చందపురంలో ఘటన
భూ వివాదంలో తమకు రావల్సిన డబ్బును గ్రామ పెద్దలు తమకు ఇవ్వకుండా వారి వద్దే పెట్టుకున్నారంటూ కృష్ణా జిల్లాలో వృద్ధ దంపతులు వినూత్న నిరసనకు దిగారు. ముసునూరు మండలం కాట్రేనిపాడు శివారు హరిచంద్రపురంలో చిలకపాటి వాసుదేవరావు, లక్ష్మి అనే వృద్ధ దంపతులు గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకుపైకి ఎక్కారు. ఎవరైనా తమను కిందకు దింపటానికి ప్రయత్నిస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు.