Penumantra: పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన టైలర్ కుమార్తె అనూరాధ!

Penumantra: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం వెలగలేరుకు చెందిన టైలర్ కుమార్తె సిర్రా అనూరాధ నీట్‌లో ప్రతిభ చాటి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.

E.ABRAHAM, ACHANTA
Published on: 7 Sept 2026 7:54 PM IST
Penumantra
X

Penumantra: పేదరికాన్ని జయించి ఎంబీబీఎస్ సీటు సాధించిన టైలర్ కుమార్తె అనూరాధ!

Penumantra: పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపిస్తూ పెనుమంట్ర మండలం వెలగలేరు గ్రామానికి చెందిన సిర్రా అనూరాధ నీట్‌లో ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. రాజమండ్రిలోని జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించే అవకాశం దక్కించుకుంది.

అనూరాధ తల్లిదండ్రులు సిర్రా నాగేశ్వరరావు, జ్యోతి సాధారణ టైలర్‌ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కుమార్తె చదువుకు వారు ఎలాంటి లోటు రానివ్వలేదు. పెద్ద కుమార్తె సిర్రా శాంతి స్వరూప డిగ్రీ బీఎస్సీ చదువుతోంది.

తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకున్న అనూరాధ లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివింది. నీట్‌లో ఉత్తీర్ణత సాధించి, ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు సంపాదించింది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె సాధించిన విజయం గ్రామంలో హర్షం నింపింది.

పట్టుదల, కృషి ఉంటే పేదరికాన్ని అధిగమించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని అనూరాధ నిరూపించిందని గ్రామస్థులు అభినందించారు. భవిష్యత్తులో మంచి వైద్యురాలిగా ఎదిగి పేదలకు సేవలందించాలని ఆకాంక్షించారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story