Warangal: మిల్స్ కాలనీలో కానిస్టేబుల్పై దాడి హత్యాయత్నం కేసు నమోదుకు డిమాండ్!
Warangal: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో టీజీఎస్పీ కానిస్టేబుల్పై దాడి తీవ్ర కలకలం. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.
Warangal: మిల్స్ కాలనీలో కానిస్టేబుల్పై దాడి హత్యాయత్నం కేసు నమోదుకు డిమాండ్!
Warangal: మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన ఘటనలో డ్యూటీలో ఉన్న బీట్ కానిస్టేబుల్ టీజీఎస్పి కానిస్టేబుల్ పై మొదట చేయి చేసుకోగా టీజీఎస్పీ కానిస్టేబుల్ తను కూడా మళ్లీ చేయి చేసుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తైతే టీజీఎస్పి కానిస్టేబుల్ పైన అదే రోజు కేసు నమోదు చేశారు.
మిల్స్ కాలనీ పోలీసులు. కానీ కానిస్టేబుల్ చేయి చేసుకున్న అనంతరం ఒక పశువును కొట్టినట్టు అక్కడే నడిరోడ్డుపై కొట్టారు బార్ షాప్ కు సంబంధించిన వ్యక్తులు. అక్కడే కాకుండా పారిపోతుంటే దొరకబట్టి మరి విచక్షణ లేకుండా కొట్టిన ఆ ఇద్దరు వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని వీడియో చూసిన ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు...!
ఆ ఇద్దరు బార్ షాప్ వ్యక్తులపై తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకుంటారా...! లేదా వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తారో వేచి చూడాలి....!




