Kesamudram: కృష్ణాష్టమి వేడుకల్లో చిందేసిన మాజీ ఎంపీ అంజన్ కుమార్!
Kesamudram: మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. ర్యాలీలో నృత్యం చేసి, ఉట్టి ఉత్సవాన్ని ప్రారంభించిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్.
Kesamudram: కృష్ణాష్టమి వేడుకల్లో చిందేసిన మాజీ ఎంపీ అంజన్ కుమార్!
Kesamudram: మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. కేసముద్రం మండల కేంద్రం లో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో మాజీ ఎంపి , అఖిల భారత యాదవ సంఘం జాతీయ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ పాల్గొని నృత్యం చేశారు.
డప్పు చప్పుళ్ళు , మహిళల కోలాటాలతో బోనం నెత్తిన పెట్టుకొని నిర్వహించిన ర్యాలీ లో పాల్గొని ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులు దేశవ్యాప్తంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారని , మహాభారత యుద్ధంలో న్యాయం పాండవుల పక్షాన ఉందని శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవుల వైపు ఉన్నాడని , పాడి పంటలు బాగా పండాలని , ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆ కృష్ణ భగవానుడిని వేడుకుంటున్నానని తెలిపారు.
Next Story




