Jangaon: పాలిటెక్నిక్ కళాశాలల విలీన ప్రతిపాదనపై సిబ్బంది నిరసన

Jangaon: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ పాలిటెక్నిక్ విలీన ప్రతిపాదనపై సిబ్బంది ఆందోళన. విలీన నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్.

MD AHMAD PASHA, JANGAON
Published on: 18 Aug 2026 4:45 PM IST
Jangaon
X

Jangaon: పాలిటెక్నిక్ కళాశాలల విలీన ప్రతిపాదనపై సిబ్బంది నిరసన

జనగామ: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను విలీనం చేసే ప్రతిపాదనపై స్టేషన్ ఘన్‌పూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో కళాశాల ప్రాంగణంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, విలీన ప్రక్రియపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు సాంకేతిక విద్యను సామాన్య, మధ్యతరగతి మరియు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందించడంలో కీలకంగా ఉన్నాయని సిబ్బంది పేర్కొన్నారు. ఇలాంటి విద్యాసంస్థల భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధనా సిబ్బంది ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

“విలీనం కాదు.. సాంకేతిక విద్య బలోపేతం కావాలి” అంటూ సిబ్బంది తమ నిరసన ద్వారా ప్రభుత్వానికి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్యా అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గంగారెడ్డి, హెడ్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ టి. అశోక్, TPJAC ప్రతినిధి సుధర్శన్ రెడ్డి, లెక్చరర్లు ధనుంజయ్, సంపత్ కుమార్, శ్రీకర్, సుకన్య, అనిల్ కుమార్, కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్లు నరేష్ కుమార్, జితేందర్, ప్రశాంత్తో పాటు క్లాస్-IV సిబ్బంది పాల్గొన్నారు.

విలీన ప్రతిపాదనపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించి, సంబంధిత సిబ్బంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాల్లో తొందరపాటు లేకుండా, సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON

Next Story