Jangaon: జనగామ ఈవీఎం గోదాంను పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్
Jangaon: జనగామ కలెక్టరేట్లోని ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. రాజకీయ పార్టీల సమక్షంలో సీసీ కెమెరాలు, భద్రత పరిశీలన.
Jangaon: జనగామ ఈవీఎం గోదాంను పరిశీలించిన కలెక్టర్ సందీప్ కుమార్
జనగామ జిల్లా: సోమవారం, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, త్రైమాసిక తనిఖీలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో గల ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, పరిశీలించారు.
ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పని తీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
ఈ పరిశీలనలో జనగామ ఆర్డీఓ గోపీరాం, తహసీల్దార్ మహిపాల్ రెడ్డి, ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి రవి, బీజేపీ పార్టీ ప్రతినిధి జగదీష్, తదితరులు పాల్గొన్నారు.
Next Story




