Hanumakonda: కమలాపూర్‌లో గంజాయి మత్తులో నలుగురి వీరంగం వ్యక్తిపై దాడి!

Hanumakonda: హన్మకొండ జిల్లా కమలాపూర్ సబ్‌స్టేషన్ వద్ద గంజాయి మత్తులో నలుగురు వ్యక్తులు వీరంగం. ఓ వ్యక్తిపై బహిరంగ దాడి.

Narender, Staff Reporter  -Warangal
Published on: 11 Aug 2026 10:04 AM IST
Hanumakonda
X

Hanumakonda: కమలాపూర్‌లో గంజాయి మత్తులో నలుగురి వీరంగం వ్యక్తిపై దాడి!

Hanumakonda: హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో గంజాయి మత్తులో నలుగురు వ్యక్తులు వీరంగం సృష్టించారు. మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ వద్ద నడిరోడ్డుపై ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గంజాయి మత్తులో యువకులు బహిరంగంగా దాడికి పాల్పడటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొందరు కార్మికులు తరచూ గొడవలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. గంజాయి విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పోలీసులను కోరుతున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story