Hanumakonda: నేటి నుంచే బడులు షురూ.. విద్యార్థులకు ఘన స్వాగతం!

Hanumakonda: తెలంగాణలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని ప్రారంభించారు.

AJAY, HANMAKONDA
Published on: 15 Jun 2026 11:14 AM IST
Hanumakonda
X

Hanumakonda: నేటి నుంచే బడులు షురూ.. విద్యార్థులకు ఘన స్వాగతం!

హనుమకొండ: నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం.. బంతి పూలు, మామిడి తోరణాలతో విద్యాలయాలను అలంకరించి విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాద్యాయులు, విద్యాశాఖ అధికారులు నేటి నుంచి విద్యార్థులకు అల్పాహారం అందించనున్న తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం.

విద్యా సంవత్సరం పునఃప్రారంభాన్ని పురస్కరించుకొని ఉదయం వేళ అల్పాహారం కార్య క్రమం ప్రారంభించనున్నట్టు తెలిపిన హనుమకొండ డీఈవో గిరిరాజ్ గౌడ్.. తొలి దశలో హనుమకొండ, కాజీపేట మండలాల్లోని 86 పాఠశాలలు ఈ పథకానికి ఎంపికైనట్లు పేర్కొన్నారు.

విద్యార్థులకు అల్పాహారంతోపాటు పాలు కూడా అందిస్తారన్నారు.. వారంలో మూడు రోజులు రాగిజావ ఇస్తామన్నారు..ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..

AJAY, HANMAKONDA

AJAY, HANMAKONDA

Next Story