Terlam: తెర్లాంలో విషాదం పిడుగుపాటుకు 30 గొర్రెలు మృతి
Terlam: విజయనగరం జిల్లా తెర్లాం మండలం నందిగాంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడగా.. పిడుగుపాటుకు గురై 30 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి.
Terlam: తెర్లాంలో విషాదం పిడుగుపాటుకు 30 గొర్రెలు మృతి
తెర్లాం: మండలంలో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది.నందిగాం గ్రామం పరిసర ప్రాంతంలో మేపు మేస్తున్న గొర్రెల మందపై పిడుగు పడి 30,గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల యజమానులు నీలబోను సూరి
కోరాడ చిన్నారావు, వారి జీవన ఆధారం ఇస్తున్న గొర్రెలు చనిపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. సుమారు నాలుగు లక్షలు రూపాయలు నష్టం వాటిలిందని, ప్రభుత్వం తమని ఆదుకోవాలని చనిపోయిన గొర్రెల యజమానులు, అధికారులను,ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Next Story




