Parvathipuram: కొత్త ఇళ్ల మంజూరుపై హౌసింగ్ ఎండీకి ఎమ్మెల్యే విజ్ఞప్తి!

Parvathipuram: గ్రామీణ, పట్టణ హౌసింగ్ అభివృద్ధిపై ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర విజయవాడలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ పి. అరుణ్ బాబును కలిసి వినతిపత్రం అందజేశారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 5 Aug 2026 12:21 PM IST
Parvathipuram
X

Parvathipuram: కొత్త ఇళ్ల మంజూరుపై హౌసింగ్ ఎండీకి ఎమ్మెల్యే విజ్ఞప్తి!

Parvathipuram: పార్వతీపురం:పార్వతీపురం ఎమ్మెల్యే శ్రీ బోనెల విజయచంద్ర గారు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పి. అరుణ్ బాబు, IAS గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పార్వతీపురం నియోజకవర్గంలోని గ్రామీణ, పట్టణ హౌసింగ్ అభివృద్ధి, కొత్తగా ఇళ్ల మంజూరుకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యల పరిష్కారం, అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన ఇళ్ల మంజూరు జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రానున్న దశలో మంజూరయ్యే గృహాల్లో పార్వతీపురం నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత కల్పించి ఎక్కువ ఇళ్లను కేటాయించాలని ఎండీ గారిని విజ్ఞప్తి చేశారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story