Vizianagaram: మానసస్ ట్రస్ట్ మెమోరియల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు
Vizianagaram: మహారాజా అలక నారాయణ గజపతి రాజు జన్మదినం సందర్భంగా మానసస్ ట్రస్ట్ 2025-26 విద్యా సంవత్సరంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు రూ. 5 లక్షల స్కాలర్షిప్లు అందజేసింది.
Vizianagaram: మానసస్ ట్రస్ట్ మెమోరియల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు
విజయనగరం: మహారాజా అలక నారాయణ గజపతి రాజు గారి జన్మదినం సందర్భంగా మానస ట్రస్ట్ మెమోరియల్ సంస్థ వారు 2025-26 విద్యా సంవత్సరంకి గాను మంచి ఫలితాలు సాధించిన 10th, ఇంటర్ విద్యార్థిని, విద్యార్థులకు విజయనగరంలో 5,00,000 లక్షలు స్కాలర్షిప్ అందజేశారు.
వీరిలో విశాఖ జిల్లా లో 3 కేజీబీవీలలో చదువుతున్న విద్యార్థినులకు మొత్తం 2 లక్షల 80 వేలు స్కాలర్షిప్ అందజేశారు. వీరిలో భీమిలి KGBV లో చదివిన 10 వ తరగతి విద్యార్థినులు 11 మంది కి మరియు ఇంటర్ 7 గురికి ఒక్కొక్కరికి 5,000 వేలు చొప్పున స్కాలర్షిప్ అందజేశారు.
ఈ అవకాశం సమగ్ర శిక్షా APC డాక్టర్ J చంద్ర శేఖర్ రావు గారి ద్వారా రావడం, ఆయన సమక్షంలోనే స్కాలర్షిప్ స్టూడెంట్స్ అందుకోవడం ఆనందంగా ఉందని విద్యాలయం ప్రిన్సిపాల్ శ్రీమతి గంగా కుమారి గారు తెలియజేశారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్త పరిచారు.




