Parvathipuram: వైఎస్సార్‌సీపీ నేత శెట్టి వెంకటరమణ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే!

Parvathipuram: పార్వతీపురం మండలం నర్సిపురంలో శెట్టి వెంకటరమణ తల్లి మృతి. వెంకటరమణ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 1 Sept 2026 12:18 PM IST
Parvathipuram
X

Parvathipuram: వైఎస్సార్‌సీపీ నేత శెట్టి వెంకటరమణ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే!

Parvathipuram: నర్సిపురం గ్రామానికి చెందిన వైసిపి కుటుంభీకులు శెట్టి వెంకటరమణ అమ్మ గారు గత రాత్రి స్వర్గస్థులు అయిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శ్రీ అలజంగి జోగారావు గారు మంగళవారం మండల నాయకులతో కలిసి వెంకటరమణ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అమ్మగారు శివైక్యం చెందిన విషయానికీ చింతిస్తూ వారి పవిత్రఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.

ఈ పరామర్శలో ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షులు బొమ్మి రమేష్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పోల సత్యనారాయణ, జడ్పీటీసీ ప్రతినిధి బలగ నాగేశ్వరరావు, ఎంపీపీ ప్రతినిధి మజ్జి శేఖర్, వైఎస్ ఎంపీపీ బంకురీ రవికుమార్, సీనియర్ నాయకులు వెంపలి గురురాజు, మడక విశ్వనాధం, తెరిలి రామస్వామి, మర్రాపు వాసుదేవరావు, యూత్ కార్యదర్శి సంజీవి నాయుడు, వోలేటి భూషణ్, అంబటి సురేష్, చెరుకుబిల్లి వినోద్, ప్రసాద్, కాపరపు రవి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story