Nathavaram: నాతవరం మండలంలో 65 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల!
Nathavaram: అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిమిత్తం 65 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల.. అభ్యంతరాల స్వీకరణ.
Nathavaram: నాతవరం మండలంలో 65 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల!
Nathavaram: త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నాతవరం మండల పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను మంగళవారం విడుదల చేశారు ఎంపీడీవో కార్యా లయంలో ఎంపీడీవో ఎంఎస్.శ్రీనివాస్ జాబితాను ప్రకటించారు.
మండలంలో మొత్తం 65 పోలింగ్ కేంద్రాలను ప్రతి పాదించినట్లు తెలిపారు పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు సూచనలు ఉంటే ఈ నెల 16లోగా తెలియజేయాలని ప్రజలు, రాజకీయ పార్టీలకు సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, టీడీపీ మండల పార్టీ అద్యక్షలు వెంకట రమణ, అధికారులు,పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.




