Anakapalli: ఒడ్డిమెట్ట స్వయంభూ లక్ష్మీ గణపతి ఆలయానికి భక్తుల పోటెత్తు!

Anakapalli: నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట స్వయంభూ లక్ష్మీ గణపతి ఆలయానికి భక్తుల రద్దీ. 120 ఏళ్ల చరిత్ర కలిగిన క్షేత్రంలో ఘనంగా చవితి వేడుకలు.

RAJU, PARAYAKARAOPETA
Published on: 14 Sept 2026 4:30 PM IST
Anakapalli
X

Anakapalli: ఒడ్డిమెట్ట స్వయంభూ లక్ష్మీ గణపతి ఆలయానికి భక్తుల పోటెత్తు!

Anakapalli: నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట గ్రామంలో స్వయంభుగా వెలసిన లక్ష్మి గణపతి స్వామి వారు భక్తుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్నాడు. సుమారు 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి వినాయక చవితి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసించే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట గ్రామంలో స్వయంభుగా వెలసిన గణనాథుడు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నాడు. సుమారు 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

అనకాపల్లి జిల్లాతో పాటు కాకినాడ జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు.

వినాయక చవితి రోజున లక్ష్మీ గణపతి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల్లో అపారమైన నమ్మకం ఉంది. దీంతో పండుగ రోజున ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది.

భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం అవసరమైన సౌకర్యాలతో పాటు, భక్తులందరికీ అన్నసంతర్పణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.

భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఒడ్డిమెట్ట గ్రామం వినాయక చవితి రోజున ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకోనుంది.

RAJU, PARAYAKARAOPETA

RAJU, PARAYAKARAOPETA