Vijayawada: ఇంద్రకీలాద్రిపై శోభాయమానంగా వినాయక చవితి వేడుకలు!

Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా వినాయక చవితి వేడుకలు. లక్ష్మీ గణపతి ఆలయంలో మహాగణపతి హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించిన దుర్గగుడి ఈఓ, చైర్మన్.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 14 Sept 2026 12:43 PM IST
Vijayawada
X

Vijayawada: ఇంద్రకీలాద్రిపై శోభాయమానంగా వినాయక చవితి వేడుకలు!

Vijayawada: విజయవాడ కనకదుర్గమ్మ కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వినాయక చవితి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది సాంప్రదాయబద్ధంగా, మరింత శోభాయమానంగా ఉత్సవాలను నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల్లో దుర్గగుడి దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఆలయ ప్రధాన కార్యనిర్వహణాధికారి వి.కె. సీనా నాయక్ పాలకమండలి సభ్యులు ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

శాస్త్రోక్తంగా పూజలు మహాగణపతి హోమం

వినాయక చవితి పురస్కరించుకుని లక్ష్మీ గణపతి ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. లోకకల్యాణార్థం విఘ్నాలు తొలగి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో మహాగణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతితో ఈ హోమం ముగిసింది.

పండితుల ఆధ్వర్యంలో వేడుకలు

ఆలయ స్థానాచార్య వి. శివప్రసాద్ శర్మ నేతృత్వంలో వైదిక కమిటీ, అర్చక బృందం వేద పండితులు ఈ పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. చైర్మన్ ఈఓ, బోర్డు సభ్యులకు పండితులు వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

గత ఏడాది కంటే మిన్నగా ఏర్పాట్లు

గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఓ సీనా నాయక్ నేతృత్వంలో మరింత విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. వినాయక చవితి పర్వదినాన ఇంద్రకీలాద్రికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన లైన్లు, ఉచిత ప్రసాద వితరణ తాగునీటి సౌకర్యాలను పకడ్బందీగా పర్యవేక్షించారు. భక్తులందరూ లక్ష్మీ గణపతిని దర్శించుకుని పునీతులయ్యారు. భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేశారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.